హైదరాబాద్ : తెలంగాణపై నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గురించి నోరు మెదపని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఉన్నట్టుండి నిన్న లోక్ సభలో వీగి పోయిన బిల్లు గురించి ప్రస్తావించడం పట్ల తెలంగాణ వాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇవాళ మహిళా బిల్లుపై కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ హయాం నుండి 2008-10లో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం వరకు, కాంగ్రెస్ ఏడుసార్లు బిల్లులను అడ్డుకుందని ఆరోపించారు. తరచుగా కాగితాలు చించి, ఎస్పీ, ఆర్జేడీ వంటి మిత్ర పక్షాలను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ చట్ట సవరణలపై కీలక బిల్లులను అడ్డుకున్నందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను కేంద్ర మంత్రి విమర్శించారు.
ప్రతిపక్షాల చర్యలు మహిళలకు, తెలంగాణతో సహా దక్షిణ రాష్ట్రాలకు ద్రోహం చేసిన చారిత్రక తప్పిదం అని ఆయన అభివర్ణించారు. అఖిలపక్ష సమావేశాలలో ప్రధాని మోదీ వివరణలు ఇచ్చినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరులను మార్చుకున్నాయని, మొదట దక్షిణాదికి అన్యాయం జరిగిందని ఆరోపించాయని, ఆ తర్వాత ఉత్తరాదిలో సీట్లు పెంచడానికి కుట్ర జరుగుతోందని నిందించాయని ఆయన హైలైట్ చేశారు. 1948 నుండి 2014 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మహిళలను లేదా బీసీ నాయకులను ముఖ్యమంత్రులుగా నియమించడంలో కాంగ్రెస్ విఫలమైందని మంత్రి ఎత్తి చూపారు, మహిళలు లేదా బీసీ సమస్యలపై మాట్లాడే వారి నైతిక హక్కును ప్రశ్నించారు.
The post విపక్షాల నిర్వాకం కిషన్ రెడ్డి ఆగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
విపక్షాల నిర్వాకం కిషన్ రెడ్డి ఆగ్రహం
Categories: