hyderabadupdates.com Gallery వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత వెంకీ మామ ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ వస్తుందనే వార్త ఒక్కటే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం మరింత హైప్‌ని పెంచేస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తనకు ఎప్పటిలా దేవిశ్రీ ప్రసాద్ లేదా థమన్‌ని కాకుండా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయబోతున్నారట. ఈ అవకాశాన్ని పొందింది యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అని సమాచారం.

అర్జున్ రెడ్డి, అనిమల్ వంటి సినిమాలతో తన ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు త్రివిక్రమ్-వెంకటేష్ ల కాంబినేషన్ కోసం ఎలా సౌండ్ అందిస్తాడన్నదే ఇప్పుడు అందరి కుతూహలం. త్రివిక్రమ్ స్టైల్‌కి తగ్గట్లుగా, వెంకీ మామ ఇమేజ్‌కి తగ్గ మ్యూజిక్ అందించగలడా అనే విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
The post వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

CJI: కొత్త సీజేఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభంCJI: కొత్త సీజేఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభం

CJI : భారత సర్వోన్నత న్యాయస్థానంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం మొదలుపెట్టింది. నవంబర్‌ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో నూతన సీజేఐ

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండిఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలుకొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

అమ‌రావ‌తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా న్యాయపరమైన అడ్డంకులు