hyderabadupdates.com Gallery శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది

శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది

శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది post thumbnail image

ముంబై : సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ జ‌ట్టును 7 ప‌రుగుల తేడాతో ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది భారత జ‌ట్టు. ముందుగా మైదానంలోకి దిగిన ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 253 ర‌న్స్ చేసింది. ఇందులో సంజు శాంస‌న్ 89, కిష‌న్ 38, శివ‌మ్ దూబే 44 , పాండ్యా 26, తిల‌క్ వ‌ర్మ 27 ర‌న్స్ చేయ‌డం ఇంగ్లండ్ జ‌ట్టును చివ‌రి ఓవ‌ర్ దాకా తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు 22 ఏళ్ల కుర్రాడు బెథెల్. త‌ను 48 బంతులు ఎదుర్కొని ఫాస్టెస్ట్ 105 సెంచ‌రీతో దుమ్ము రేపాడు. త‌ను మైదానంలో ఉన్నంత వ‌ర‌కు ఇండియాకు గెలుస్తామ‌న్న ఆశ‌లు లేవు. ఇక బౌలింగ్ ప‌రంగా ఇండియా సూప‌ర్ షో ప్ర‌ద‌ర్శించింది. మ్యాచ్ గెలుపొందిన అనంతరం ముఖ్య భూమిక పోషించిన సంజూ శాంస‌న్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ద‌క్కింది.
మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ మాట్లాడాడు. ఈ విజ‌యం శాంస‌న్ తో పాటు స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, పాండ్యా, ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు ద‌క్కుతుంద‌న్నాడు. వారు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేయ‌డం, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత‌మైన క్యాచ్ లు ప‌ట్ట‌డం కూడా ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు చెప్పాడు. ఇక ఫైన‌ల్ మ్యాచ్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామ‌ని అన్నాడు. 143 కోట్ల భార‌తీయుల ఆశీస్సులు త‌మ‌కు ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ అద్భుత‌మైన మ్యాచ్ ను గెలుపొంద గ‌లిగామ‌ని పేర్కొన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. మ‌రో వైపు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఇంగ్లండ్ కూడా సూప‌ర్ షో చేసింద‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌న్నాడు . మొత్తంగా క‌థ ముగిసింద‌ని, ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ ఉంద‌ని దాని కోసం మేం ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నాడు.
The post శాంస‌న్, బుమ్రా వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైంది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్Minister Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌ పాలనపై మంత్రి జూపల్లి సంచలన కామెంట్స్

    బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, ఆ పార్టీకి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, కళ్యాణ్‌ నగర్‌ వెంచర్‌ త్రీ, రాజీవ్‌నగర్‌

సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషంసూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం

అమరావతి : సూక్ష్మ సేద్యం ప‌థ‌కం ( మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి,

Jayaram Opens Up on His Role in Pan-India Hit ‘Kantara: Chapter 1’Jayaram Opens Up on His Role in Pan-India Hit ‘Kantara: Chapter 1’

Malayalam actor Jayaram has shared his experience of starring in the pan-India blockbuster Kantara: Chapter 1, directed by Rishab Shetty. The actor plays the pivotal role of Bhangra Raju Rajasekhar,