hyderabadupdates.com Gallery శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు

శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు post thumbnail image

తిరుపతి/ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్న ప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్ప‌ష్టం చేశారు.
అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించ నున్నట్లు తెలిపారు. అనంతరం జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం అధికారులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధులు, నిత్య అన్నప్రసాద భవనం, శ్రీ సీతారాముల కల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తదుపరి టీటీడీ, జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ టి.వి.సత్యనారాయణ, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు శివప్రసాద్, సెల్వం, డీఈ (ఎలక్ట్రికల్) రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం జేఈవో మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున ఈ ఉత్స‌వాల‌కు భ‌క్తులు హాజ‌ర‌వుతార‌ని , ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఏఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చూస్తామ‌న్నారు.
The post శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలకు ఏర్పాట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డిసెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉపేంద‌ర్ రెడ్డి గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన

ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాంఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం

న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు. శుక్ర‌వారం న్యూఢిల్లీలో జ‌రిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ప‌లు కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ

Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేసారు. చరిత్ర