hyderabadupdates.com Gallery సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్

సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ post thumbnail image

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తాజాగా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ప‌ర్ ఫార్మెన్స్ గురించి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జింబాబ్వేతో జ‌రిగిన కీల‌క పోరులో త‌ను కేవ‌లం 15 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 24 ర‌న్స్ చేశాడు. ఏ ఆట‌గాడైనా అద్బుతంగా ఆడాల‌ని అనుకుంటాడ‌ని అన్నాడు. కుదురు కునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నాడు సంజూ శాంస‌న్ . జింబాబ్వేపై గెలుపొందిన అనంత‌రం త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నాడు.
మ్యాచ్ లో భాగంగా నా వంతు ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశాన‌ని అన్నాడు సంజు శాంస‌న్. అది కూడా ఓపెనర్‌గా, అయినప్పటికీ నేను ఈరోజు విఫలమయ్యానంటూ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో త్వరగా 20 పరుగులు చేసినప్పుడు, అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందన్నాడు. అతనికి బలమైన PR మద్దతు ఉందని నాకు తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ తాను ఇప్పటికీ నా వంతు ఆడేందుకు, బ‌ల‌మైన షాట్స్ కొట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పాడు కేరళ స్టార్ క్రికెట‌ర్. ఈ T20 ప్రపంచ కప్‌లో నేను టీమ్ ఇండియాకు ఇచ్చిన ప్రారంభం, రోహిత్‌కు ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వడానికి ఆరు T20 ప్రపంచ కప్‌లు పట్టిందన్నాడు సంజు శాంస‌న్. కాబట్టి ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టడం మానేసి మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించాల‌ని అభిమానుల‌ను, క్రికెట్ ప్రేమికుల‌ను కోరాడు.
The post సంజూ శాంస‌న్ షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు

ఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలుఉగాది నుంచి గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని

PM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీPM Narendra Modi: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్‌ – ప్రధాని మోదీ

    పెద్దసంఖ్యలో పుణ్యక్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌కు అసలైన బలం ఆధ్యాత్మిక శక్తి అని, ఈ రాష్ట్రం సంకల్పిస్తే రాబోయే అయిదేళ్లలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించగలదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిర్భవించిన పాతికేళ్లలో అన్ని రంగాల్లో గణనీయ పురోగతి సాధించి ఇతర