hyderabadupdates.com Gallery సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్

సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సికింద్రాబాద్ పై. ప్ర‌స్తుతం కాంగ్రెస్ స‌ర్కార్ చ‌రిత్ర‌ను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రో వైపు ఈ న‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారంతా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలో సికింద్రాబాద్ లోనే అతి పెద్ద జ‌నాభా క‌లిగిన మ‌ల్కాజిగిరి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీగా ఉన్నారు ఈట‌ల రాజేంద‌ర్. శ‌నివారం ఆయ‌న సికింద్రాబాద్ పై జ‌రుగుతున్న వివాదంపై స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ రెండూ అద్భుత‌మైన న‌గ‌రాల‌ని, ఈ రెండింటికి ఘ‌న‌మైన వార‌స‌త్వం, చ‌రిత్ర ఉంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్. ఇంకొక‌రు చెరిపి వేయాల‌ని చూస్తే వారిని జ‌నం క్షమించ‌ర‌ని అన్నారు.
సికింద్రాబాద్ పేరును ఎవరు తక్కువ చేయకూడదు అలా అని మల్లజిగిరిని కూడా తక్కువ చేయవద్దని సూచించారు ఈట‌ల రాజేంద‌ర్. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్కాజిగిరి దేశంలోనే అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న కార్పొరేట‌ర్లంతా మ‌ల్కాజ్ గిరి జిల్లాకు చెందిన వారేన‌ని చెప్పారు. సికింద్రాబాద్ చరిత్ర, గ్లామర్, గొప్పదనానికి తాను వ్యతిరేకం కాదని అన్నారు. కానీ మల్కాజిగిరి పేరు మార్చమనడం సరికాదని స్ప‌ష్టం చేశారు. మార్చాలి అనే వారు అనాడు అధికారంలో ఉన్నారని, అప్పుడు ఎందుకు సికింద్రాబాద్ ను జిల్లాగా ప్ర‌క‌టించ లేక పోయారో ఒక‌సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.
The post సికింద్రాబాద్ న‌గ‌రం చ‌రిత్ర ఘ‌నం : ఈట‌ల రాజేంద‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

న్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణన్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణ

అమ‌రావ‌తి : కొత్త సాంకేతిక‌త‌తో రైతుల భూముల‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ

CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళంCM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

  ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

ఆఫ్గ‌నిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. త‌న సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో త‌మ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్ర‌క‌టించింది ఆఫ్గ‌నిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని