hyderabadupdates.com movies సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు

సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. అతడి వద్ద ఆధార్ కార్డు లేకపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే ఉండిపోయాడు.

ఆసుపత్రి సిబ్బంది తనను కరుణించి.. వైద్యం చేస్తారని భావిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎలాంటి వైద్య సాయం అందకపోవటం.. ఆహారం అందకపోవటంతో నీరసించిపోయాడు. క్యాంటీన్ ఆవరణలోనే స్ర్పహ తప్పిపోయాడు. అచేతన స్థితిలో ఉన్న రాజును చూసి అతడు మరణించినట్లుగా భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవటంతో అతడ్ని మార్చురీ ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచేశారు. తర్వాతి రోజు మార్చురీ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బాధితుడిలో కదలికల్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అత్యవసర వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.

Related Post

Nidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film EraNidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film Era

Actor Nidhhi Agerwal has spoken with heartfelt admiration about Prabhas, crediting him for transforming the scale and ambition of Indian cinema. In a recent interaction, Nidhhi said she strongly believes

‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

ఏడాది చివర్లో బాక్సాఫీస్ వేటకు వచ్చి, సంచలన వసూళ్లు సాధించిన ‘దురంధర్’ సినిమా.. 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాక ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సాధించే దిశగా