hyderabadupdates.com Gallery హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు

హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు

హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు post thumbnail image

తిరుమ‌ల : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేద‌న్నారు. ఆ దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్ అంటూ మండిప‌డ్డారు. ఆయన పేరు ఉచ్ఛరించే అర్హత, నైతికత నీకుందా అని నిల‌దీశారు. హిందూ వ్యతిరేకి అయిన నువ్వు సీఎంగా ఉన్నావనే కదా నీ అనుచరులకి ధైర్యం అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి రెచ్చిపోయి హిందూ మత ఔన్నత్యాన్ని మంటగలిపారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం తిరుమల కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు బీఆర్ నాయుడు.
అన్య మతస్తుడవైన నువ్వు ఇప్పటి వరకు దేవదేవునిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. సీఎంగా ఉండగా నీ భార్యతో కలిసి గుడికి వచ్చి పట్టు వస్త్రాలిచ్చావా? రాలేదు ఎందుక‌ని, ఆ విష‌యం బ‌హిరంగంగా చెప్పాల‌న్నారు. నీ జీవితంలో నీ భార్య తో కలిసి తిరుమలకు రాలేవు.. ఎందుకంటే మీ ఇద్దరూ నమ్మేది ఏసుప్రభువునే కానీ శ్రీ వేంకటేశ్వర స్వామిని కాదు కాబట్టి అంటూ మండిప‌డ్డారు టీటీడీ చైర్మ‌న్. తాను చైర్మ‌న్ గా కొలువు తీరాక తిరుమ‌ల‌ను ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. అన్య‌మ‌త ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేశామ‌న్నారు. నీ అండతో నీ బాబాయ్, భూమన చేసిన అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయని నీ బాధంతా త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండరాదని నేను నిర్ణయం తీసుకున్న నాడే నాపై పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించావని అర్థ‌మైంద‌ని అన్నారు. అందులో భాగంగానే కదా నాపై డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తిరుమల ప్రతిష్ట దెబ్బతీయాలని చూశావంటూ ఫైర్ అయ్యారు.
The post హిందూత్వం గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోంతిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త

తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై