hyderabadupdates.com Gallery అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం post thumbnail image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
అనంతరం గోవింద నామ స్మరణలతో మారు మోగుతున్న గిరి శిఖరం పైకి భక్తులతో కలిసి మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, తిరు కళ్యాణ మహోత్సవం తిలకించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల‌య్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ సమన్వయంతో ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఈ దేవాలయాన్ని ఎకో టెంపుల్ టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ శ్రీనివాసగిరి వేంకటేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకోవడం జరిగిందన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, అధికారులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
The post అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్కVruksha Maate: 114 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వృక్షమాత తిమ్మక్క

    వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… బెంగళూరు జయనగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఆమె దత్తపుత్రుడు ఉమేశ్‌ వెల్లడించారు. వివాహమైన తర్వాత పాతికేళ్లయినా సంతానం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యంఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ముంబై : క్రికెట్ ఆట‌లో ఉన్న మ‌జా ఏమిటో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ తెలియ చేసింది. అందుకే కోట్లాది మంది క్రికెట్ అంటే ప‌డి చ‌స్తారు. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగిన ఈ కీల‌క పోరు

Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలుUpendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు.