అమరావతి : రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.6,000ను కూడా తమవేనని చూపిస్తూ రైతులను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్”లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు. అర్హత కలిగిన భూయజమానులు, అటవీ భూమి సాగుదారులకు మూడు విడతల్లో రాష్ట్రం నుంచి రూ.14,000 మరియు కేంద్రం నుంచి రూ.6,000 చొప్పున అందజేస్తున్నారని తెలిపారు.
భూమిలేని సాగుదారులకు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే సంవత్సరానికి రూ.20,000 రెండు విడతల్లో చెల్లిస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు. 2025–26లో ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రెండు విడతల్లో కలిపి రూ.6,309.44 కోట్లు (రాష్ట్రం రూ.4,685.84 కోట్లు; కేంద్రం రూ.1,623.60 కోట్లు) 46.86 లక్షల రైతు కుటుంబాలకు పంపిణీ చేశామన్నారు. అర్హత ఉన్నవారు మిగిలి పోకుండా గ్రీవెన్స్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. 2026–27 సంవత్సరానికి మొత్తం రూ.9,700 కోట్లు బడ్జెట్లో కేటాయించామని వెల్లడించారు అచ్చెన్నాయుడు.
దీని వలన రాష్ట్రంలోని పంట భూములు న్యూట్రియంట్ సమతౌల్యం ఏర్పడి పంట ఉత్పత్తి , ఉత్పాదకత పెరగటం ద్వారా రైతుల ఆదాయాలు పెరిగాయన్నారు. అదే వైసీపీ హయాంలో 2019-2024 మధ్య కాలంలో కేవలం ఒక్క 2019-20 సంవత్సరంలో మాత్రమే రూ.31.35 కోట్లు సబ్సిడీ వ్యయంతో 31,859 టన్నుల సూక్ష్మపోషకాలు 1.47 లక్షల మంది రైతులకు మాత్రమే, అదికూడా రాయితీని 100% నుండి 70% కి తగ్గింఛి పంపిణీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2025-26 రబీ సీజన్ కోసం సబ్సిడీపై సూక్ష్మ పోషకాల సరఫరాకు 16.17 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
The post అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో భరోసా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో భరోసా
Categories: