hyderabadupdates.com Gallery అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష post thumbnail image

తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది ఒడ్డున ఉన్న కాశీ, ఉజ్జయిన్‌తో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్న పవిత్ర హారతి కార్యక్రమాలపై అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతి, గంటల నాదాల మధ్య నిర్వహించే పవిత్ర హారతి భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని అన్నారు. కాబట్టి కమిటీ లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వివిధ రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసినట్లు ఈవో తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గౌహతి మరియు బెల్గాం ప్రాంతాలలో భూమి కేటాయింపున‌కు సంబంధించి సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని అన్నారు.
వేద పారాయణదారులు , పోటు కార్మికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఈ నెలాఖరులోగా తగిన ఏర్పాట్లు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీ పరిధిలోని 59 స్థానిక మరియు అనుబంధ ఆలయాలలో 1,004 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, వాటిలో 794 కెమెరాలు ఇప్పటికే పని చేస్తున్నాయని ఈవో తెలిపారు. మిగిలిన ప్రదేశాలలో కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
The post అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!

కన్నడ హీరో,  డైరెక్టర్ రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన నటనకు మరియు దర్శకుడిగా చూపిన ప్రతిష్టకు ప్రేక్షకులు చాలా మెచ్చుతున్నారు. ఈ సినిమా సంబంధిత పనులు పూర్తయిన తర్వాత రిషబ్ ప్రస్తుతం పూర్తి

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడుSathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

    సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది

India – Afghanistan: కాబుల్‌ లో భారత రాయబార కార్యాలయంIndia – Afghanistan: కాబుల్‌ లో భారత రాయబార కార్యాలయం

India : పాక్‌తో ఘర్షణ వేళ అఫ్గానిస్థాన్‌తో భారత్ సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన