hyderabadupdates.com Gallery ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను

ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను

ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను post thumbnail image

ముంబై : మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వ‌స్తానో తెలియద‌ని అన్నారు. త‌న‌కు రావాలంటే ఇక్క‌డ పాస్ పోర్టు రావాల్సి ఉంటుంద‌న్నారు. కానీ అది దొర‌క‌డం లేద‌న్నారు. ముంబై హైకోర్టుకు హాజ‌రు కావాల్సి ఉండ‌గా త‌న త‌ర‌పు న్యాయ‌వాది ఈ విష‌యాన్ని పై విధంగా తెలిపారు. రద్దు చేయబడిన తర్వాత తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్ట్ లేదని, అందువల్ల, భారతదేశానికి తిరిగి వచ్చే తేదీని తాను ఇవ్వలేనని మాల్యా అన్నారు. బహుళ మోసం, మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు వ్యాపార‌వేత్త‌. తాను యుకె నుండి రావాలంటే పాస్ పోర్టు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని పేర్కొన్నారు. ఇక్క‌డ చ‌ట్ట బ‌ద్దంంగా త‌న‌పై నిషేధం ఉంద‌న్నారు. దీని వ‌ల్ల తాను రాలేక పోతున్న‌ట్లు తెలిపారు విజ‌య్ మాల్యా.
తన న్యాయవాది అమిత్ దేశాయ్ ద్వారా హైకోర్టుకు సమర్పించిన అఫిడ‌విట్ లో పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్ట్ లేదన్నారు. దీని కార‌ణంగా ఎప్పుడు వ‌స్తాన‌నే విష‌యం , తేదీ చెప్ప‌డం సాధ్యం కాద‌న్నారు వ్యాపార‌వేత్త‌. ఇదిలా ఉండ‌గా విజ‌య్ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చే వరకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్‌ను విచారించబోమని ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా భారతదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా అని స్పష్టం చేయాలని కోర్టు మాజీ మద్యం వ్యాపారిని కోరింది.
The post ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ

Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌

Russia : భారత్‌కు రష్యా బంపరాఫర్‌ ప్రకటించింది. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.

CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

CBI : పంజాబ్ పోలీస్ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌చరణ్ సింగ్ బుల్లర్ అవినీతి కేసులో గురువారం అరెస్ట్ అయ్యారు. ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు ఆయన్ని మొహాలి ఆఫీస్‌లో అదుపులోకి తీసుకున్నారు.