hyderabadupdates.com Gallery ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ లేదు డిజిల్ లేదు అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు..రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట అంటూ ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు అని మండిప‌డ్డారు ష‌ర్మిలా రెడ్డి. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గు పడాలన్నారు.రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.
సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అంటూ ప్ర‌శ్నించారు ఏపీపీసీసీ చీఫ్ .పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణం అన్నారు. ప్ర‌ధాని మోదీకి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చో బెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరం అని పేర్కొన్నారు.
సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కొరత తీరదన్నారు. అమ్మకాలు, ఆందోళనల పేరుతో మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తే కుదరదు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలన్నారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ష‌ర్మిలా రెడ్డి.
The post ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్Martlet Missiles: ఇండియన్ ఆర్మీ చేతికి ‘మార్ట్‌లెట్‌’ మిసైల్స్

Martlet Missiles : భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది. రక్షణరంగంలో పరస్పర విస్తృత సహకారం కోసం భారత్‌-యూకే మధ్య కీలకమైన ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’ (Martlet Missiles)లను

Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్

  అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా,

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన