hyderabadupdates.com Gallery ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా

ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా post thumbnail image

న్యూఢిల్లీ : వైసీపీ ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లో అమలాపురంలో జరిగిన ఓఎన్‌జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్‌లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో గ్యాస్ లీక్‌తో పాటు చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం గురించి నిల‌దీశారు. ఈ ఘటనకు ముందు అక్కడ తప్పనిసరిగా అమలు చేయాల్సిన భద్రతా తనిఖీలు, పరికరాల సర్టిఫికేషన్, ఒత్తిడి పరీక్షలు, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయా అని ఎంపీ అడిగారు. అలాగే ఈ ప్రమాదానికి ఓఎన్‌జీసీ అధికారులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమా అని పేర్కొన్నారు. ఎవరైనా బాధ్యులపై చర్యలు తీసుకున్నారా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వెల్లడించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
దీనిపై స‌మాధానం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. జ‌న‌వ‌రి 5న ఏపీలోని మోరి -5 చ‌మురు క్షేత్రంలో వ‌ర్క్ ఓవ‌ర్ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో గ్యాస్ లీక్ జ‌రిగింద‌ని ఒప్పుకున్నారు. ఈ క్షేత్రాన్ని 15 సంవత్సరాల ప్రొడక్షన్ ఎన్‌హాన్స్‌మెంట్ కాంట్రాక్ట్ కింద ఏప్రిల్ 3, 2025 నుంచి ఎం/ఎస్ డీప్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నదని స్ప‌ష్టం చేశారు.
ఘటన జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ తన సాంకేతిక నిపుణుల సహాయంతో ఐదు రోజులలోనే మంటలను అదుపులోకి తెచ్చి బావిని సురక్షితంగా మూసి వేసిందని సురేష్ గోపి చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదా ఎవరికీ గాయాలు ఏవీ జరగలేదని అన్నారు.. క్షేత్రాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించినప్పటి నుంచి డీజీఎంఎస్ వంటి చట్టబద్ధ సంస్థలు తరచూ భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
The post ఓఎన్‌జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

    పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే

బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీబంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ

దుబాయ్ : భ‌ద్ర‌తా కార‌ణాల పేరుతో వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేర‌కు త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ మైదానాలు

PM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీPM Narendra Modi: బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

    బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్డీయే.. ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామం అందుకు వేదికైంది. బిహార్‌ మాజీ సీఎం, దివంగత