hyderabadupdates.com Gallery యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి

యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి

యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి post thumbnail image

అమ‌రావ‌తి : యువ‌తీ యువ‌కులు స్వామి వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత వివేకానంద వేసిన మార్గంలో నడుస్తుందని నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ అభివృద్ధికి యువతరం సహకరించాలని కూడా నాయుడు పిలుపు ఇచ్చారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం స్వామి వివేకానంద ఆదర్శాల నుండి బలాన్ని పొందుతుందని ఆయన అన్నారు.
వివేకానంద బోధనలు ఆత్మ విశ్వాసం, ధైర్యం, సేవా స్ఫూర్తిని నిరంతరం ప్రేరేపిస్తాయని ఆయన చెప్పారు. ఆ దార్శనిక నాయకుడు యువ మనస్సులపై అపారమైన నమ్మకం ఉంచి, వారు వ్యక్తిత్వ నిర్మాణం, జ్ఞాన సముపార్జన, మానవత్వానికి సేవ చేయాలనే నిబద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువ‌తీ యువ‌కులు మన దేశానికి గొప్ప బలం అని అన్నారు. క్రమశిక్షణ, ఐక్యత , సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత వివేకానంద వేసిన మార్గంలో నడుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ అభివృద్ధికి యువతరం సహకరించాలని కూడా నాయుడు పిలుపునిచ్చారు.
ప్ర‌పంచంలోనే మ‌హోన్న‌త‌మైన మాన‌వుడిగా గుర్తింపు పొందారు స్వామి వివేకానందుడు అని అన్నారు ఈ సంద‌ర్బంగా నారా చంద్రబాబు నాయుడు. చివ‌రి శ్వాస వ‌ర‌కు దేశం కోసం ప‌రిత‌పించాడ‌ని పేర్కొన్నారు. భార‌తీయ జాతిని జాగృతం చేసిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు ముఖ్య‌మంత్రి.
The post యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !

    కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్‌ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో

Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Justice Suryakant : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులుCII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

    విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ఏపీకి భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తొలి రోజు శుక్రవారం 40 సంస్థలతో రూ.3,49,476 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా 4,15,890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.