hyderabadupdates.com Gallery న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హిళా ఐఏఎస్ ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛాన‌ల్ తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ల్స్ ల‌లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఆయా సామాజిక వేదిక‌ల ద్వారా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా న‌ల్ల‌గొండ జిల్లాలో రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌ద‌రు మ‌హిళా ఐఏఎస్ తో ప్రేమాయ‌ణం న‌డిపారంటూ సంచ‌ల‌న ప్ర‌త్యేక క‌థ‌నం ఎన్టీవీలో ప్ర‌సారం అయ్యింది. దీనిని ఆధారంగా చేసుకుని మిగ‌తా యూట్యూబ్ ఛాన‌ల్స్ కూడా పెద్ద ఎత్తున స్టోరీస్ తో పాటు చ‌ర్చ‌లు కూడా చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల‌లో పెను సంచ‌ల‌నం రేపింది. ఈ త‌రుణంలో మ‌హిళా ఐఏఎస్ ను వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్. ఈ మేర‌కు ఆయ‌న ఖండిస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. తాజాగా సోమ‌వారం అసోసియేష‌న్ త‌ర‌పున పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌హిళా ఐఏఎస్ , మంత్రికి లింకు పెడుతూ స్టోరీ టెలికాస్ట్ చేసిన ఎన్టీవీతో స‌హా పలు న్యూస్ చానల్స్, సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్. అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.
The post న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలిపార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి

గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అంటేనే కార్య‌క‌ర్త‌లు అని, వారు లేక పోతే పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ రెడ్డి

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గేఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్