hyderabadupdates.com Gallery క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర

క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర post thumbnail image

అమ‌రావ‌తి : క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర సృష్టించింద‌ని అన్నారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాకినాడలో రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్‌ ఏర్పాటు కావడం శుభసూచకం అన్నారు. 495 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉద్యోగాల కల్పన జ‌రుగుతుంద‌న్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత పరిశ్రమలలో ఒకటిగా ఈ ప్లాంట్ నిలవడం ఆంధ్రప్రదేశ్ కే గర్వ కారణం అని అన్నారు. ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి.
పర్యావరణ అనుకూల విధానాలు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ ప్రాజెక్టు ఒక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా ఉంటుంద‌న్నారు. కాకినాడ పోర్ట్‌కు కేవలం 1 కి.మీ దూరంలో ప్లాంట్ ఉండటంతో వ్యూహాత్మకంగా ప్రపంచ స్థాయి ఎగుమతులకు గొప్ప అవకాశంగా మారుతుంద‌ని చెప్పారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో, అన్ని విధాలుగా త‌మ ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకంతో ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రం మారుతోంద‌ని, ఈ సంద‌ర్బంగా అభినందించారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి.
ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు. ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వచ్చారని తెలిపారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయని అన్నారు సీఎం. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఇందుకు ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంద‌న్నారు.
The post క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చ‌రిత్ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two yearsCM Revanth asks to complete construction of new Osmania Hospital buildings in two years

Chief Minister Revanth Reddy has instructed the officials to complete the construction of the new buildings of Osmania Hospital within two years. He held a review meeting at his residence on the progress of the construction work

Raghuram Rajan: అమెరికా హైర్‌ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌Raghuram Rajan: అమెరికా హైర్‌ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌

    అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్‌ఐఆర్‌ఈ-హైర్‌) చట్టం… హెచ్‌-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పరిణామం మనదేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై