hyderabadupdates.com Gallery జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు.

ట్రైలర్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కథలోని సస్పెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ మొదలైంది. అసలు రిలీజ్‌కు ముందే ఇంత హైప్ రావడం సుధీర్ బాబుకు కూడా ఒక పాజిటివ్ సైన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల వంటి మంచి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి మేజిక్ చూపుతుందో అన్నదానిపైనే ఉంది.

The post జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులుBomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేళుళ్ళతో దేశం అట్టుడుకుతున్న వేళ… పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపారు. అందులో దిల్లీ, కోల్‌కతా,

CM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబుCM Chandrababu: విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం – సీఎం చంద్రబాబు

    ముంబయి తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ నగరం ఐటీ హబ్‌ గా మారుతోందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కు చాలా చేసామని