hyderabadupdates.com Gallery జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు.

ట్రైలర్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కథలోని సస్పెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ మొదలైంది. అసలు రిలీజ్‌కు ముందే ఇంత హైప్ రావడం సుధీర్ బాబుకు కూడా ఒక పాజిటివ్ సైన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల వంటి మంచి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి మేజిక్ చూపుతుందో అన్నదానిపైనే ఉంది.

The post జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీPM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

    ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ

Minister Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌Minister Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి

Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !Himachal Pradesh: హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ! 15 మంది మృతి !

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సుపై కొండచరియలు భారీగా విరుచుకుపడటంతో 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 25-30 మంది ఉన్నట్లు