hyderabadupdates.com Gallery మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు post thumbnail image

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో మ‌ద్యం స్కాంకు సంబంధించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు ​​జారీ చేసింది. జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న పాత్ర‌, సంబ‌ధిత ఆర్థిక లావాదేవీల‌పై ఆరా తీయ‌నుంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక ఉన్న‌ట్టుండి మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి న‌మ్మిన బంటుగా, నెంబ‌ర్ 2 గా ఉన్నారు విజ‌య సాయి రెడ్డి. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ వ‌రుస ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విజ‌య సాయి రెడ్డి ఉన్న‌ట్టండి తాను వైఎస్సార్సీపీ నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.
అంతే కాకుండా పార్టీ ప‌రంగా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ పార్టీ కి పూర్తిగా దూరంగా ఉండేందుకు గాను తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ప‌లు ఊహాగానాల మధ్య ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వెళ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌ట‌స్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈడీ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న‌కు పెద్ద దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాటి నుంచి త‌న త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తిగా ఉన్నారు విజ‌య‌సాయి రెడ్డి.
The post మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు

మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తిమ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. ఆదివారం ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె