hyderabadupdates.com movies రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల భారం కూడా ఒక్కరే మోస్తున్నారు. అల్లరితో హీరో నరేష్ కో ఇంటి పేరు ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత అనసూయ, అమరావతి లాంటి థ్రిల్లర్ మూవీస్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా పూర్ణ లీడ్ రోల్ చేసిన అవును చాలా పాపులారిటీ తెచ్చింది. తర్వాత వరస ఫ్లాపులు రవిబాబుకి కొంత గ్యాప్ వచ్చేలా చేశాయి. ఇప్పుడు రేజర్ తో కంబ్యాక్ అవుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. మనకున్న హీరోల్లో తొంభై శాతం మంది డూపులతోనే మేనేజ్ చేశారని, అందుకే తన రేజర్ లో మధ్య వయసు ఉన్న పర్ఫెక్ట్ ఛాయస్ కోసం వెతికితే తనలా ఫిజిక్, కష్టపడే తత్వం ఎవరిలో కనిపించకపోవడం వల్లే నేనే హీరోగా చేశానని అన్నారు. నాలా నటించే వాళ్ళు కూడా దొరకలేదు అన్నారు. సరే అందులో కొంత లాజిక్ ఉన్నా పూర్తిగా ఏకీభవించలేని పాయింట్స్ కొన్ని ఉన్నాయి.

హీరోలకు డూప్ వాడటం అనేది ఇప్పటిది కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమానా నుంచి మహేష్ బాబు దాకా అందరూ చేసేదే. కాకపోతే సీన్ డిమాండ్ చేస్తే దాన్ని వద్దని మరీ రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. గూండా ట్రైన్ ఎపిసోడ్ కోసం చిరంజీవి ఎంత రిస్క్ చేశారో ఇప్పటికీ కథలుగా చెబుతారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహెష్ బాబు వీళ్ళందరూ కూడా సందర్భానుసారం డూప్స్ అవసరం లేకుండా కష్టపడిన వాళ్లే.

కాకపోతే ప్రతిసారి డూప్స్ లేకుండా చేయలేరు. ముందైతే దర్శక నిర్మాతలే వద్దంటారు. వందల కోట్ల పెట్టుబడులతో సినిమా తీస్తున్నప్పుడు హీరో ప్రాణాలను రిస్క్ చేయలేరు. డూపులు ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ హీరోలు అంత అలవోకగా చేయలేరు కాబట్టి సహాయం అవసరం అవుతుంది. అన్ని చోట్ల టామ్ క్రూజ్ లు ఉండరు కదా. అడ్జస్ట్ అవ్వాల్సిందే.

Related Post

2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా

హుటాహుటిన పేలుడు ప్రాంతానికి.. బాధితులకు బాబు అండ!హుటాహుటిన పేలుడు ప్రాంతానికి.. బాధితులకు బాబు అండ!

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు