hyderabadupdates.com Gallery లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు

లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు post thumbnail image

అమ‌రావ‌తి : నారా లోకేష్ యువ గ‌ళం చేప‌ట్టి స‌రిగ్గా మూడేళ్లు పూర్త‌య్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకున్నారు. జ‌గ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. ఒక ర‌కంగా తెలుగుదేశం ప‌వ‌ర్ లోకి రావ‌డానికి నారా లోకేష్ చేసిన యువ గ‌ళం కీల‌క పాత్ర పోషించింది. ఆయ‌న‌పై ప‌లు కేసులు బ‌నాయించింది ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్. అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇదే క్ర‌మంలో త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడును స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాం పేరుతో వేధింపుల‌కు గురి చేయ‌డం, ఆ త‌ర్వాత అరెస్ట్ చేసి నిర్బంధించ‌డం కూడా ఎదుర్కొన్నారు నారా లోకేష్. అన్నింటిని త‌ట్టుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.
ఇవాళ రాష్ట్రంలో ఐటీ, విద్యా శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నాడు . స‌మ‌ర్త‌వంతంగా పాల‌నలో భాగం పంచుకుంటూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నాడు. ప్ర‌త్యేకించి ఐటీ ప‌రంగా , ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో త‌న తండ్రి చంద్ర‌బాబుతో పోటీ ప‌డుతున్నాడు. ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్లాడు. ఆపై భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేలా ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌ఫలీకృతం అయ్యాడు నారా లోకేష్. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో పాల్గొన్నారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడంలో ,తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందేందుకు వీలు కల్పించడంలో రఘురామ రాజు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దాదాపు 300–400 కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి సహాయ పడుతుందని అన్నారు.
The post లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్ఏపీలో కుట్ర‌ల‌కు బెంగ‌ళూరులో జ‌గ‌న్ ప్లాన్

అమ‌రావ‌తి : తెలుగుదేశం పొలిట్ బ్యూరో స‌భ్యుడు , మాజీ స్పీక‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. బెంగ‌ళూరులో మ‌కాం వేసిన జ‌గ‌న్ అక్క‌డి నుంచే

అంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణంఅంగ‌రంగ వైభోగం ధ్వ‌జారోహ‌ణం

తిరుపతి : తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి అమ్మ వారు, శ్రీ

Minister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

    రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు.