hyderabadupdates.com Gallery శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం

శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని చెప్పారు . గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుందని అన్నారు సీఎం. 2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం అన్నారు. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ అది అని పేర్కొన్నారు. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించు కోకుండా యదేఛ్చగా కొనసాగించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపామ‌ని తెలిపారు. సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసిందన్నారు. భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారని పేర్కొన్నారు సీఎం. హైందవం పట్ల ఆయనకు విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా అని ప్ర‌శ్నించారు ముఖ్య‌మంత్రి.
The post శ్రీ‌వారి ప్ర‌సాదం అప‌చారం వాస్త‌వం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్

కేర‌ళ : కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ కు బిగ్ షాక్ త‌గిలింది. రేప్ చేసిన కేసులో త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు త‌ర‌లించారు. గ‌త‌ డిసెంబర్ 2024లో పాలక్కాడ్ ఉప ఎన్నికలో రాహుల్ సాధించిన అద్భుత విజయం తర్వాత

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దంశ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.

కలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయంకలర్స్ హెల్త్ కేర్ 2.O సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్, వెల్‌నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సౌతిండియన్ గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా