hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం post thumbnail image

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్ అనంత‌రం మీడియాతో మాట్లాడాడు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని మ్యాచ్ ఇది అని పేర్కొన్నాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో త‌మ అంచ‌నాల‌కు మించి ఆడాడంటూ సంజూ శాంస‌న్ గురించి పేర్కొన్నాడు. త‌ను చివ‌రి దాకా నిలవ‌డ‌మే కాదు కీల‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని, కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాడ‌ని ప్ర‌శ‌సంలు కురిపించారు సూర్య కుమార్ యాద‌వ్.
ఒక ర‌కంగా చెప్పాలంటే సంజూ శాంస‌న్ గ‌నుక మైదానంలో లేక పోయి ఉంటే భార‌త జ‌ట్టు సెమీస్ కు చేరుకుని ఉండేది కాద‌న్నాడు. క‌ళాత్మ‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. పూర్తిగా పాత స్టైల్ క్లాసిక్ బ్యాటింగ్ తో మ‌న‌సు దోచుకున్నాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్. ఇదే క్ర‌మంలో కామెంటేట‌ర్ బాక్స్ లో ఉన్న మాజీ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. యాభై పూర్తి చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోకు, సిక్స్ కొట్టడానికి తొందరపడి బయటకు వెళ్లకు. మళ్ళీ గార్డ్ ఫ్రెష్ గార్డ్ తీసుకొని, కొత్త లైన్లు గీయడం, మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం, మళ్ళీ అతను పిచ్ అర్థం చేసుకున్నట్లుగా రెండు బంతుల డిఫెన్స్ ఆడాడు.. అంటే అతను భారతదేశం గెలిపించే వరకు తన విధి పూర్తి కాదని అతనికి తెలుసు అని పేర్కొన్నాడు.
The post సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !

Family Suicide : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Family Suicide). ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్‌ తన

శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనంశ్రీ కోదండ రామస్వామి ఆలయంలో తిరుమంజనం

తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా

PM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీPM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

PM Modi : ఏపీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో కర్నూలు లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ… అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా