hyderabadupdates.com Gallery హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్

హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్

హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్ post thumbnail image

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు చేసిన కామెంట్స్ పై . ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని అన్నారు. హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిస్తే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారని , అలా వెల్ల‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం ఇద్దరు కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. మ‌రి గతంలో హరీష్ రావు వేరే పార్టీల నాయకుల ఇళ్లకు వెళ్లలేదా..? అని ప్ర‌శ్నించారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి.
రేవంత్ రెడ్డి హైబ్రిడ్ విధానాన్ని క్రాస్ బీడ్ అంటున్న హరీష్ రావుకు సోయి లేద‌న్నారు ఎంపీ. క్రాస్ బీడ్, క్రాస్ ఓటింగ్ చేసి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించింది బీఆర్ఎస్ కాదా అని నిల‌దీశారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అవయవ దానం చేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామని హరీష్ రావు క‌ల‌లు క‌న్నాడ‌ని ఎద్దేవా చేశారు. మా మామ కేసీఆర్ తర్వాత నేను సీఎం అవుతా లేకపోతే మా కుటుంబ సభ్యులు అవుతారని హరీష్ రావు భావించారని కానీ అది వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు. రోజూ ఏదో ఒకటి మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని , ఇది మానుకోవాల‌ని సూచించారు.
The post హ‌రీశ్ రావు కామెంట్స్ ఎంపీ చామ‌ల కౌంట‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డిఅట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

అమరావతి : కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత ,

Tribal Woman: గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!Tribal Woman: గిరిజన మహిళ దాతృత్వం ! ఇందిరమ్మ ఇళ్లకు ఎకరం భూమి దానం!

    ఎకరం భూమిని తోటి గ్రామస్థులకు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు ఓ గిరిజన మహిళ. ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ(ఎస్‌) పంచాయతీలో కోలాం గిరిజనులకు 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ నిర్మించుకోవడానికి స్థలం కరవైంది.

మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లుమ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు

శ్రీ‌శైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా అధికారులను