hyderabadupdates.com movies అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. సుప‌రిపాల‌న అందించేందుకు.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న విధానంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా ప్ర‌కృతి విప‌త్తులు, మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి. దీంతో ఇటు ప్ర‌జ‌ల‌కు.. అటు స‌ర్కారుకు కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం.

వ‌ర‌ద‌లు.. వ‌ర్షాలు.. తుఫాన్లు వంటివి కామ‌న్‌గా వ‌స్తాయి. వీటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేరు. కానీ, న‌ష్టం రాకుండా.. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుని విప‌త్తుల నుంచి బ‌య‌ట ప‌డొచ్చు. ప్ర‌భుత్వం దీనినే అనుస‌రిస్తోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తుఫాన్లు వ‌చ్చినా.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఆస్తులు, పొలాలు.. పంట‌లు, ఇళ్లు వంటివాటికి న‌ష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన ప‌రిహారం ప్ర‌భుత్వం ఇస్తోంది.

ఇక‌, మాన‌వ త‌ప్పిదాల కారణంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. కొన్ని ఉన్నాయి. గ‌త ఏడాది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల స‌మ‌యంలో తిరుప‌తిలో ఏర్పాటు చేసిన టోకెన్ల క్యూలైన్ల‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. అప్ప‌ట్లో ఆరుగురు మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల అల‌స‌త్వం, ముంద‌స్తు వ్యూహం కొర‌వ‌డిన కార‌ణంగానే జ‌రిగింద‌ని నివేదిక‌లు తేల్చాయి. దీంతో ఇద్ద‌రు అధికారుల‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.

ఆ త‌ర్వాత‌.. సింహాద్రి అప్ప‌న్న చంద‌నోత్స‌వ స‌మ‌యంలో పిట్ట‌గోడ కూలిపోయి.. భ‌క్తుల‌ పై పడిన ఘ‌ట‌న‌లో ఏడుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ విష‌యంలోనూ ఆల‌య అధికారుల త‌ప్పులు ఉన్నాయ‌ని గుర్తించిన ప్ర‌భుత్వం వారి పై చ‌ర్య‌లు తీసుకుంది. ఇక‌, ఇటీవ‌ల క‌ర్నూలులో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న కూడా.. తీవ్రంగా క‌ల‌చి వేసింది 19 మంది కాలి బుగ్గ‌య్యారు. ఇక‌, ఇప్పుడు కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. కూడా ఓ ప్రైవేటు వ్య‌క్తి నిర్ల‌క్ష్యం కార‌ణంగా చోటు చేసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆయా ఘ‌ట‌నలు.. ఇటు ప్ర‌భుత్వాన్ని, అటు ప్ర‌జ‌ల‌ను కూడా ఊపిరి తీసుకోలేనంతగా బాధిస్తున్నాయ‌నే చెప్పాలి.

Related Post

మరోసారి భారత్ ఊచకోతమరోసారి భారత్ ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్ హ‌ద్దులు దాటిపోతుంటాయి కానీ.. చాలా వ‌ర‌కు తెలుగు కుర్రాళ్ల మీమ్స్‌ సినీ జ‌నాలు సైతం ఎంజాయ్ చేసేలా స‌ర‌దాగా ఉంటాయి.

Andhra King Taluka Trailer: Ram Pothineni’s Fandom-Driven Madness Wins HeartsAndhra King Taluka Trailer: Ram Pothineni’s Fandom-Driven Madness Wins Hearts

The theatrical trailer of Andhra King Taluka, starring energetic star Ram Pothineni and directed by Mahesh Babu P, has finally arrived — and it has taken fans by storm. Launched