hyderabadupdates.com Gallery ఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీ

ఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీ

ఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీతో ఆర్టీసీ జేఏసీ నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి రాలేదు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది ఆర్టీసీ సంస్థ యాజ‌మాన్యం. మ‌రోవైపు 24 గంట‌లు త‌న త‌లుపులు తెరుచుకునే ఉంటాయ‌ని చెప్పిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ ప‌త్తా లేకుండా పోయాడ‌ని జేఏసీ నేత‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో వైపు ప్రైవేట్ వ్య‌క్తుల‌తో బ‌స్సులు న‌డిపించాల‌ని చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. ఇదే క్ర‌మంలో ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు చేస్తున్న స‌మ్మె చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. స‌మ్మె కార‌ణంగా వేలాది మంది ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నార‌ని వాపోయారు.
ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స‌మ్మె చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని, కార్మికులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 ప్రకారం సమ్మెలో పాల్గొని విధులకు హాజరు కాకపోవడం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. సంస్థ ప్రయాణికుల సేవే పరమావధిగా పని చేస్తోంద‌న్నారు. ఇటీవల వివిధ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై స్పందించారు. కార్మిక శాఖ, యాజమాన్యం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించింద‌న్నారు. ఈ తరుణంలో కార్మికులందరూ ఈ క్రింది ముఖ్యమైన చట్టపరమైన అంశాలను గమనించాలని కోరారు ఎండీ నాగిరెడ్డి.పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 22(1)(d) ప్రకారం, సంబంధిత అధికారి (Conciliation Officer) వద్ద ఒక వివాదం పెండింగ్‌లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం అని హెచ్చ‌రించారు ఎండీ.
The post ఆర్టీసీ స‌మ్మె చేయ‌డం చ‌ట్ట విరుద్దం : ఎండీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతటీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన కీల‌క పోరులో భార‌త్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. ఈ టోర్నీ లో మ‌రోసారి

ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌

వత్సవాయి/జగ్గయ్యపేట : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్ల‌డించారు.