hyderabadupdates.com Gallery ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం

ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం post thumbnail image

హైద‌రాబాద్ : ఇండియాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మీడియా సంస్థ‌గా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను కోరారు లేఖ‌లో. ఈ మేరకు ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ , ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరీ ఆయనకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడం లోనూ, రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో సందర్భోచితంగా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ గమనాన్ని అంచనా వేస్తూ, కీలక అంశాలపై చర్చించే వేదికగా ఈ కాన్‌క్లేవ్ గుర్తింపు పొందింది. భిన్నమైన ఆలోచనలు, స్వేచ్ఛాయుతమైన చర్చలు, సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తోంది.ఈ వేదికపై ప్రసంగించిన ప్రపంచస్థాయి దిగ్గజాల సరసన కేటీఆర్ చేరనున్నారు. ఇప్పటి వరకు ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి దేశాధినేతలతో పాటు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, గీతా గోపీనాథ్ వంటి పారిశ్రామిక, ఆర్థిక రంగ నిపుణులు ప్రసంగించారు. భారతదేశపు మారుతున్న రాజకీయ, ఆర్థిక ముఖచిత్రంపై కేటీఆర్ తన విశ్లేషణను పంచుకోవాలని ఇండియా టుడే గ్రూప్ కోరింది.
The post ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రంకోట్లాది మంది కూలీల పొట్ట కొట్టిన కేంద్రం

అనంతపురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌న‌మిస్తున్నార‌ని హెచ్చ‌రించారు. జాతీయ ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాల‌ని

కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి టైమ్‌లో అనేక సినిమాలతో పోటీగా విడుదల కావడం ఈ

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000