hyderabadupdates.com Gallery ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి

ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి post thumbnail image

అమరావతి : ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ క్లస్టర్ ఏర్పాటుతో 22 వేల మంది మహిళలకు లబ్ది కలగనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, స్థానిక మహిళలకు ఉపాధి కల్పను కృషి చేస్తామని వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత పైవిధంగా స్పందించారు. ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మెగా క్లస్టర్ ఏర్పాటుతో స్వల్పకాలంలో ఏడు వేల మందికి, దీర్ఘ కాలంలో 15 వేల మందికి..ఇలా 22 వేల మంది మహిళలకు ఉపాధి కలుగనుందన్నారు.
ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తో శ్రీసత్యసాయి, అనంతపురం మహిళలకు ఎంతో లబ్ధి కలుగనుందన్నారు. ఇటీవల నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అందించనున్నామని, దీనిలో భాగంతో అనంతపురంలో సర్వే నిర్వహించామని తెలిపారు. ఈ సర్వేలో స్వల్ప సంఖ్యలో చేనేతలు ఉన్నట్లు గుర్తించామన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. దీనిలో భాగంగా అనంతపురం నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి, ఆ నియోజక వర్గ మహిళలకు అండగా నిలుస్తామని మంత్రి సవిత తెలిపారు.
The post ధర్మవరం మెగా క్లస్టర్ తో మ‌హిళ‌ల‌కు ఉపాధి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శIPS Suicide: ఐపీఎస్‌ పూరన్‌ కుమార్ భార్యకు సీఎం పరామర్శ

IPS Suicide : హరియాణాకు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య (IPS Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య, ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్

డీఎంకే దుష్ట శ‌క్తి అన్నాడీఎంకే అవినీతి శ‌క్తిడీఎంకే దుష్ట శ‌క్తి అన్నాడీఎంకే అవినీతి శ‌క్తి

మామ‌ల్లాపురం : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జ‌రిగే ఎన్నిక‌లు ఎన్నిక‌లు కానే కాద‌న్నారు. ఆయ‌న అధికారంలో ఉన్న డీఎంకే, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకి పారేశారు. న‌టుడి నుంచి రాజ‌కీయ