hyderabadupdates.com Gallery ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలు

ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలు

ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలు post thumbnail image

తిరుపతి : సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ‌ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం, రాజంపేటలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంల‌లో జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాళ్లపాకలోని ధ్యాన మందిరంలో మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటగా అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు, స్థానిక కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉద‌యం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి కల్యాణం క‌న్నుల పండుగ‌గా జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా మే 2 నుండి 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు గాత్ర సంగీతం, హరికథ, నృత్య, నాటక ప్ర‌ద‌ర్శ‌న‌ కార్యక్రమాలు జరుగనున్నాయి.
రాజంపేట‌లోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద మే 2వ తేదీ సాయంత్రం 6.30 గంట‌లకు ఊంజల్ సేవ జ‌రుగ‌నుంది. అదేవిధంగా మే 2 నుండి 8వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత, వాద్య‌, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మే 2వ తేదీ ఉదయం 9 గంటలకు సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భ, ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది.
మే 3 నుండి 7వ తేదీ వ‌ర‌కు ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. మే 8వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ కోదండ రామ‌స్వామి వారి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు సంగీత స‌భ‌, హ‌రిక‌థ గానం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా మే 2 నుండి 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు గాత్ర సంగీతం, నృత్య, వాద్య‌, హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
మహతి కళాక్షేత్రంలోనూ మే 2 నుండి 8వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత, నృత్య, వాద్య‌ కార్యక్రమాలు జరుగనున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనల సౌరభాన్ని ఆస్వాదించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
The post ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను త‌న సార‌థ్యంలో రెండుసార్లు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని, త‌మ కుర్రాళ్లు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక మ్యాచ్ లో కీల‌క భూమిక

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

విజ‌య‌వాడ‌ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌ను రీ స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా స‌ర్వే చేసిన భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్

Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవితEx MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత

Ex MLC Kavitha : జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు