చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులతో అలరారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈనెలలో శివ రాత్రి పర్వదినం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఇదిలా ఉండగా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలిశారు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్. ఈ సందర్భంగా పూజారులు ఆశీర్వచనం అందజేశారు పవన్ కళ్యాణ్ కు. అనంతరం సాయి ప్రసాద్ దేవాలయ కమిటీ తరపున పవన్ కు ఆహ్వాన పత్రికను ఇచ్చారు.
శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆలయ కమిటీ చైర్మన్. ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలని కోరారు. మీరు గెలవాలని ప్రార్థనలు కూడా చేశామన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.
The post బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
Categories: