hyderabadupdates.com Gallery మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు post thumbnail image

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో మ‌ద్యం స్కాంకు సంబంధించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు ​​జారీ చేసింది. జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. విచార‌ణ‌లో భాగంగా ఆయ‌న పాత్ర‌, సంబ‌ధిత ఆర్థిక లావాదేవీల‌పై ఆరా తీయ‌నుంది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక ఉన్న‌ట్టుండి మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి న‌మ్మిన బంటుగా, నెంబ‌ర్ 2 గా ఉన్నారు విజ‌య సాయి రెడ్డి. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ వ‌రుస ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విజ‌య సాయి రెడ్డి ఉన్న‌ట్టండి తాను వైఎస్సార్సీపీ నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.
అంతే కాకుండా పార్టీ ప‌రంగా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ పార్టీ కి పూర్తిగా దూరంగా ఉండేందుకు గాను తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ప‌లు ఊహాగానాల మధ్య ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వెళ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న త‌ట‌స్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈడీ నుంచి స‌మ‌న్లు అందుకున్నారు. రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న‌కు పెద్ద దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాటి నుంచి త‌న త‌న‌యుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన వ్య‌క్తిగా ఉన్నారు విజ‌య‌సాయి రెడ్డి.
The post మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ధోనీ ప్లేస్ ను భ‌ర్తీ చేసే స‌త్తా శాంస‌న్ కు ఉందిధోనీ ప్లేస్ ను భ‌ర్తీ చేసే స‌త్తా శాంస‌న్ కు ఉంది

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అనిల్ కుంబ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో హీరోగా నిలిచిన కేర‌ళ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సీఎస్కే త‌ర‌పున ఆడ‌డంపై స్పందించాడు. త‌ను అద్భుతమైన ఆట‌గాడ‌ని,

Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌Cloud Seeding: ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ ఫెయిల్‌

Cloud Seeding : ఢిల్లీలో క్లౌడ్‌ సీడింగ్‌ కు బ్రేక్‌ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ (Delhi) రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud Seeding) ఫెయిల్‌

ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్

చెన్నై : 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్. సోమ‌వారం ఆయ‌న జెండాను ఆవిష్క‌రించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తాము ఏక రూప భార‌త దేశాన్ని కోరుకోవ‌డం లేద‌ని అన్నారు.