hyderabadupdates.com Gallery సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు కొర కొర‌రానిదిగా త‌యారైన సామాజిక మాధ్య‌మాల‌పై నియంత్రించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా గ‌తంలో తీసుకు వ‌చ్చిన నియంత్ర‌ణ బిల్లులో మ‌రిన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ప్ర‌తిపాదించారు ఇవాళ పార్ల‌మెంట్ సాక్షిగా.
ఈ మేర‌కు భారత ప్రభుత్వం ‘సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నియమాలు, 2021స బిల్లుకు మరిన్ని సవరణలను ప్రతిపాదించింది . డిజిటల్ రంగంలో నియంత్రణను పటిష్టం చేయడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం , తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడం లక్ష్యంగా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే చాలా మందిని జైలు పాలు చేసింది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ లేకుండా చేసేందుకే ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు ముందుకు తీసుకు వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా దీనిని వ్య‌తిరేకిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికలపై వార్తా సంబంధిత కంటెంట్‌ను పోస్ట్ చేసే లేదా షేర్ చేసే వ్యక్తిగత వినియోగదారులను కూడా ‘సమాచార సాంకేతికత నియమాలు, 2021’ పరిధిలోకి తీసుకు వచ్చేలా భారత ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీంతో వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ అనేది ఉండ‌దు. దీని ద్వారా ఎవ‌రినైనా స‌రే ఏదో ఒక కారణంతో నేరుగా కేసులు న‌మోదు చేయ‌వ‌చ్చు. ఆపై అదుపులోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దీనిపై మేధావులు, బుద్ది జీవులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
The post సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీక్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ

కోల్ క‌తా : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుస‌రించిన తీరు పై స్పందించాడు. ప్ర‌స్తుతం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి.

పూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారుపూరీ జ‌గ‌న్నాథ్ సేతుప‌తి మూవీ టైటిల్ ఖ‌రారు

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు తెలిపారు. త‌మిళ చ‌ల‌న చిత్ర

‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ‌

హైద‌రాబాద్ : మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి కీ రోల్స్ పోషించిన చిత్రం భ‌ర్త మ‌హాశ‌యులుకు విజ్ఞ‌ప్తి. సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో పాటు మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి.