hyderabadupdates.com movies హీరో గారికి ఫ్యాన్స్ లేరు కానీ ఎలివేషన్లు కావాలి

హీరో గారికి ఫ్యాన్స్ లేరు కానీ ఎలివేషన్లు కావాలి

ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకట్రెండు హిట్లు పడగానే కొందరు హీరోలు చేసే అతి మాములుగా ఉండదు. తమకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ వచ్చేసిందని ఫీల్ అయిపోవడం.. కథల్లో భారీతనం, ఎలివేషన్లు కోరుకోవడం.. పారితోషికాలు పెంచేయడం.. ఇలా అతి చేసే హీరోలకు కొదవేమి లేదు ఇండస్ట్రీలో. ఒక ఊహా ప్రపంచం సృష్టించుకుని అందులో బతికేస్తుంటారు ఈ బాపతు హీరోలు.

తనక్కూడా అలాంటి హీరోనే తగిలాడని అంటున్నాడు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే గాయపడ్డ సింహం చిత్ర దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్. అతడికి ఇదే తొలి చిత్రం. మరి ఈ కథే చెప్పాడా.. వేరే స్టోరీ చెప్పాడా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఒక హీరోకు కథ నచ్చి కూడా అందులో ఎలివేషన్లు లేవు అన్న కారణంతో తనతో సినిమా చెయ్యలేదని వెల్లడించాడు కశ్యప్ శ్రీనివాస్.

సదరు హీరో మేనేజర్ తన దగ్గరికి వచ్చి, సారుకు కథ నచ్చింది కానీ, ఇందులో అభిమానులు కోరుకునే ఎలివేషన్లు లేవేంటి అని అభ్యంతర పెట్టినట్లు కశ్యప్ చెప్పాడు. ఐతే ఆ హీరోకు గతంలో కానీ.. ఇప్పుడు కానీ అసలు ఫ్యాన్స్ అన్నవాళ్లే లేరు అన్నది చేదు నిజం అని వ్యాఖ్యానించాడు కశ్యప్.

నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అయితే.. ఎలివేషన్లు లేకపోతే తమకే ఏదోలా అనిపిస్తుందని.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని ఇలాంటి హీరోలు ఎలివేషన్లు కోరుకుంటే ఏం చెయ్యాలి అన్నట్లు మాట్లాడాడు కశ్యప్. కొందరు కొన్ని కథల వల్ల స్టార్లు అవుతారని.. కానీ ఆల్రెడీ స్టార్లు అయిపోయాం అనుకుంటేనే కష్టమని కశ్యప్ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి హీరోలు వేరే జోన్లో బతుకుతుంటారని.. వాళ్ళతో మనం సినిమా చెయ్యలేని అతను తేల్చేశాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన గాయపడ్డ సింహం మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

Related Post

యుద్ధం అంత నిడివి ఉంటే చూస్తారాయుద్ధం అంత నిడివి ఉంటే చూస్తారా

రేపు బాలీవుడ్ మల్టీస్టారర్ బోర్డర్ 2 విడుదల కానుంది. 1997లో వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ కొనసాగింపుగా రూపొందిన ఈ వార్ డ్రామా ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లెన్త్

టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

ఏపీలో జ‌రిగిన మేయ‌ర్ దంప‌తుల దారుణ హ‌త్య కేసులో స్థానిక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన

100 కోట్ల షేర్… ఇక మిగిలింది ఈ ఇద్దరే100 కోట్ల షేర్… ఇక మిగిలింది ఈ ఇద్దరే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు 100 కోట్ల షేర్ అనేది ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. ఒకప్పుడు 50 కోట్లు వస్తేనే గొప్ప అనుకునేవాళ్లం, కానీ ఇప్పుడు మార్కెట్ రేంజ్ పెరగడంతో స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల షేర్ అనేది మినిమం