hyderabadupdates.com Gallery అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష post thumbnail image

తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది ఒడ్డున ఉన్న కాశీ, ఉజ్జయిన్‌తో పాటు ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తున్న పవిత్ర హారతి కార్యక్రమాలపై అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతి, గంటల నాదాల మధ్య నిర్వహించే పవిత్ర హారతి భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని అన్నారు. కాబట్టి కమిటీ లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వివిధ రాష్ట్రాల రాజధానులలో శ్రీ వేంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసినట్లు ఈవో తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గౌహతి మరియు బెల్గాం ప్రాంతాలలో భూమి కేటాయింపున‌కు సంబంధించి సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని అన్నారు.
వేద పారాయణదారులు , పోటు కార్మికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఈ నెలాఖరులోగా తగిన ఏర్పాట్లు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీ పరిధిలోని 59 స్థానిక మరియు అనుబంధ ఆలయాలలో 1,004 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, వాటిలో 794 కెమెరాలు ఇప్పటికే పని చేస్తున్నాయని ఈవో తెలిపారు. మిగిలిన ప్రదేశాలలో కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
The post అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలుశ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఫిబ్రవరి 05న కోయిల్ ఆళ్వార్

Minister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డిMinister Kishanreddy: వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం – కిషన్‌రెడ్డి

    బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘‘ కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏం చేయగలడు. సుప్రీంకోర్టు తీర్పునకు