hyderabadupdates.com Gallery లేమ‌ల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ స్టార్ట్

లేమ‌ల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ స్టార్ట్

లేమ‌ల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ స్టార్ట్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీలోని లేమ‌ల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. సోమ‌వారం ప‌ల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కర్లపూడి – లేమల్లె లో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు.గ్రామంలో 2654 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్ప‌టికే కాంపిటెంట్ అధారిటీ. ల్యాండ్ పూలింగ్ కొరకు గ్రామానికి వచ్చిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు. తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ కు ఎంపిక చేసినందుకు సీఏం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ కు ధన్యవాదాలు తెలిపారు అన్న‌దాత‌లు. ఈ సంద‌ర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుల‌ను ఆగ‌మాగం చేసింద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నం చేసినా తాము వాటిని స‌రిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఆరు నూరైనా స‌రే ఏపీకి రాజ‌ధాని అమ‌రావ‌తియేన‌ని ప్ర‌క‌టించారు నారాయ‌ణ‌. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల చెవుల్లో జ‌గ‌న్ రెడ్డి పూలు పెట్టాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు మంత్రి. ఇక‌నైనా త‌ను మారితే మంచిద‌ని, లేక పోతే రాబోయే ఎన్నిక‌ల్లో త‌న‌ను, పార్టీని అడ్ర‌స్ లేకుండా చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారాయ‌ణ‌.
The post లేమ‌ల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్ర‌క్రియ స్టార్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

యువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలియువ‌త వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాలి

అమ‌రావ‌తి : యువ‌తీ యువ‌కులు స్వామి వివేకానందుడిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు ఏపీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పాటిస్తూ యువత

అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!అఖండ 2 స్పీడు పెంచాల్సిందే!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న “అఖండ 2” సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. “అఖండ” ఇచ్చిన ఘనవిజయం తర్వాత ఈ జోడీ మళ్లీ