hyderabadupdates.com Gallery ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

ఏపీలో  విదేశీ నిపుణుల బృందం పర్యటన post thumbnail image

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. రెండో రోజు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 1 లో మట్టి పటిష్టత ఎలా ఉందో పరిశీలించారు. ఇప్పటికి మట్టిని గట్టి పరిచిన ప్రాంతంలో కొంత మేర తవ్వి అక్కడ గట్టి దనం ఎలా ఉందో లోపలకు దిగి పరిశీలించారు. మరో చోట బంక మట్టిని వేసి దానిని పటిష్ట పరిచే తీరును పరిశీలించారు. బంక మట్టి పరిచి రోలర్ తిప్పిన తరువాత ఎంత మేర గట్టి పడుతుందో చూశారు. అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
గ్యాప్ 2 ఆకృతులపై చర్చించారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్ లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని తదితరులు ఉన్నారు.
The post ఏపీలో విదేశీ నిపుణుల బృందం పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీMadhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ (BJP) ఎంపీ గణేష్ సింగ్ (MP Ganesh Singh) అందరూ

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంLabour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

    కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌ (స్మృతి)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు

Bihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీBihar Assembly Elections: సీఎం నితీశ్ నివాసం వద్ద టికెట్ల పంచాయతీ

Bihar Assembly Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీ దగ్గరపడుతోన్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష పార్టీల్లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో తమకు టికెట్ దక్కాలని భావిస్తోన్న కొందరు