hyderabadupdates.com Gallery మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది. ఏకంగా రూ. 300 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకుంది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. తెలంగాణ‌కు చెందిన బీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఏకంగా విడుద‌లై నాటి నుంచి నేటి దాకా థియేట‌ర్ల‌లో ఫుల్ తో నిండి పోయాయి. ప్ర‌ధానంగా చాన్నాళ్ల త‌ర్వాత జోష్ తో న‌టించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక న‌య‌న‌తార న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌తి వారి గుండెను త‌డిమేలా చేసింది.
ఆహ్లాద‌క‌ర‌మైన స‌న్నివేశాలు, ఆస‌క్తిక‌ర‌మైన చిత్రీక‌ర‌ణ‌, వెర‌సి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మ‌రోసారి త‌న మార్క్ ను మ‌రోసారి తెర‌పై ప్ర‌ద‌ర్శించారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధిస్తూ విస్మ‌య ప‌రిచేలా చేసింది. దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకుంది. అల‌రించేలా చేసింది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా మెగాస్టార్ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. అక్కున చేర్చుకుంట‌న్నారు. త‌క్కువ పెట్టుబ‌డి తో తీసిన ఈ మూవీ కాసుల పంట పండించేలా చేసింది. ఇదిలా ఉండ‌గా రాబోయే రోజుల్లో ఇంకెన్ని డ‌బ్బులు వ‌సూలు చేస్తుందో తెలియ‌ద‌ని పేర్కొంటున్నారు.
The post మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

ఆఫ్గ‌నిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. త‌న సార‌థ్యంలో నిర్వ‌హిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో త‌మ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్ర‌క‌టించింది ఆఫ్గ‌నిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని

ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లుఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో వ్య‌వసాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ‌, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం

PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలుPM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి