hyderabadupdates.com Gallery ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ post thumbnail image

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో భాగంగా ఎతిహాద్ అరేనా వేదిక‌గా సంగీత క‌చేరి నిర్వ‌హించాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న చ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. ఇక్క‌డ చేప‌ట్టిన క‌చేరి భ‌వ‌నం పూర్తిగా నిండి పోయింది. పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌రు కావ‌డం విశేషం. ఏకంగా 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. రెహ‌మాన్ పాట‌ల‌ను ఆస్వాదించారు. దాదాపు నాలుగు గంట‌ల‌కు పైగా ఈ సంగీత క‌చేరి సాగింది. చిన్నారులు, పెద్ద‌లు, మ‌హిళ‌లు, వ‌య‌సు పైబ‌డిన వారు కూడా హాజ‌ర‌య్యారు. త‌న పాట‌ల‌ను ఆస్వాదించారు హాయిగా.
ఇక ఈ క‌చేరి ప్రారంభం అయిన వెంట‌నే ఏఆర్ రెహ‌మాన్ తొలుత త‌ను స్వ‌ర ప‌ర్చిన టాప్ సాంగ్స్ ను ఆలాపించారు. ప్ర‌ధానంగా దక్షిణాది పాట‌ల‌తో స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత సూప‌ర్ హిట్ హిందీ సాంగ్స్ ను పాడ‌డు. ఈ మద్రాస్ మొజార్ట్ ఈ కచేరీని మ‌ణిర‌త్నం తీసిన ఆయుత ఎళుత్తు చిత్రంలోని జన గణ మన పాడాడు. వందే మాత‌రం, మా తుఝే స‌లాం తో ముగించాడు. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు పొందిన స్ల‌మ్ డాగ్ నుండి జై హో పాట‌ను ఆలాపించాడు. ఇదే క్ర‌మంలో జై హో సాంగ్ రెహ‌మాన్ ది కాద‌ని అది వేరే గాయ‌కుడు ఇచ్చాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇన్ని వివాదాలు, ఆరోప‌ణ‌ల తర్వాత రెహ‌మాన్ క‌చేరి స‌క్సెస్ కావ‌డం విశేషం.
The post ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిలఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ

సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్సింగ‌రేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్ర‌సాద్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాల‌న‌లో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీస‌ర్లు ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా బుధ‌వారం ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అత్యంత కీల‌క‌మైన సింగ‌రేణి సంస్థ‌కు చీఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్