hyderabadupdates.com Gallery ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ post thumbnail image

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో భాగంగా ఎతిహాద్ అరేనా వేదిక‌గా సంగీత క‌చేరి నిర్వ‌హించాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న చ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. ఇక్క‌డ చేప‌ట్టిన క‌చేరి భ‌వ‌నం పూర్తిగా నిండి పోయింది. పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌రు కావ‌డం విశేషం. ఏకంగా 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. రెహ‌మాన్ పాట‌ల‌ను ఆస్వాదించారు. దాదాపు నాలుగు గంట‌ల‌కు పైగా ఈ సంగీత క‌చేరి సాగింది. చిన్నారులు, పెద్ద‌లు, మ‌హిళ‌లు, వ‌య‌సు పైబ‌డిన వారు కూడా హాజ‌ర‌య్యారు. త‌న పాట‌ల‌ను ఆస్వాదించారు హాయిగా.
ఇక ఈ క‌చేరి ప్రారంభం అయిన వెంట‌నే ఏఆర్ రెహ‌మాన్ తొలుత త‌ను స్వ‌ర ప‌ర్చిన టాప్ సాంగ్స్ ను ఆలాపించారు. ప్ర‌ధానంగా దక్షిణాది పాట‌ల‌తో స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత సూప‌ర్ హిట్ హిందీ సాంగ్స్ ను పాడ‌డు. ఈ మద్రాస్ మొజార్ట్ ఈ కచేరీని మ‌ణిర‌త్నం తీసిన ఆయుత ఎళుత్తు చిత్రంలోని జన గణ మన పాడాడు. వందే మాత‌రం, మా తుఝే స‌లాం తో ముగించాడు. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు పొందిన స్ల‌మ్ డాగ్ నుండి జై హో పాట‌ను ఆలాపించాడు. ఇదే క్ర‌మంలో జై హో సాంగ్ రెహ‌మాన్ ది కాద‌ని అది వేరే గాయ‌కుడు ఇచ్చాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇన్ని వివాదాలు, ఆరోప‌ణ‌ల తర్వాత రెహ‌మాన్ క‌చేరి స‌క్సెస్ కావ‌డం విశేషం.
The post ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌రాల వెల్లువ

ఆదిలాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వ‌రాల జ‌ల్లులు కురిపించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం, నిర్మల్‌లో

PM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆపరేషన్ సిందూర్‌’కి స్పూర్తి శ్రీరామచంద్రుడే – ప్రధాని మోదీ

      పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్‌ సిందూర్‌, నక్సలిజం, జీఎస్టీ

Ponnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలుPonnam Prabhakar: రాజకీయ దుమారం రేపుతోన్న మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar)…చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ను ఉద్దేశించి… పొన్నం (Ponnam Prabhakar)