యూఏఈ : తన పట్ల వివక్ష కొనసాగుతోందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి యూఏఈ వేదికగా ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఎతిహాద్ అరేనా వేదికగా సంగీత కచేరి నిర్వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో తన చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక్కడ చేపట్టిన కచేరి భవనం పూర్తిగా నిండి పోయింది. పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కావడం విశేషం. ఏకంగా 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. రెహమాన్ పాటలను ఆస్వాదించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా ఈ సంగీత కచేరి సాగింది. చిన్నారులు, పెద్దలు, మహిళలు, వయసు పైబడిన వారు కూడా హాజరయ్యారు. తన పాటలను ఆస్వాదించారు హాయిగా.
ఇక ఈ కచేరి ప్రారంభం అయిన వెంటనే ఏఆర్ రెహమాన్ తొలుత తను స్వర పర్చిన టాప్ సాంగ్స్ ను ఆలాపించారు. ప్రధానంగా దక్షిణాది పాటలతో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సూపర్ హిట్ హిందీ సాంగ్స్ ను పాడడు. ఈ మద్రాస్ మొజార్ట్ ఈ కచేరీని మణిరత్నం తీసిన ఆయుత ఎళుత్తు చిత్రంలోని జన గణ మన పాడాడు. వందే మాతరం, మా తుఝే సలాం తో ముగించాడు. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు పొందిన స్లమ్ డాగ్ నుండి జై హో పాటను ఆలాపించాడు. ఇదే క్రమంలో జై హో సాంగ్ రెహమాన్ ది కాదని అది వేరే గాయకుడు ఇచ్చాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇన్ని వివాదాలు, ఆరోపణల తర్వాత రెహమాన్ కచేరి సక్సెస్ కావడం విశేషం.
The post ఏఆర్ రెహమాన్ కచేరికి పోటెత్తిన ఫ్యాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఏఆర్ రెహమాన్ కచేరికి పోటెత్తిన ఫ్యాన్స్
Categories: