hyderabadupdates.com Gallery జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ post thumbnail image

న్యూఢిల్లీ : స‌న్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్ర‌భావం అన్ని రంగాల‌లో ఉంటుంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించ‌డం మంచిద‌ని సూచించారు. దేశ రాజ‌ధాని వేధిక‌గా జ‌రిగిన ఏఐ వ‌ర‌ల్డ్ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఎక్కువ‌గా ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అసోసియేట్ (బీపీఓ) రంగాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. తాజాగా వినోద్ ఖోస్లా చేసిన కామెంట్స్ ఐటీ రంగంలో క‌ల‌క‌లం రేపాయి. రాబోయే రోజుల‌లో ఇండియాలోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఆలోచించ‌క పోవ‌డం మంచిద‌ని సూచించారు.
ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, ఉద్యోగం కోసం చదవడం అనేవి సరైన ఆలోచన కాకపోవచ్చంటూ బాంబు పేల్చారు వినోద్ ఖోస్లా. వీటి స్థానంలో రోబోలు చేరుకుంటాయ‌ని, వేలాది మంది చేసే ప‌నుల‌ను కొన్ని రోబోలు భ‌ర్తీ చేస్తాయ‌న్నారు. రాబోయే రోజుల‌లో ఏఐలో నైపుణ్యం క‌లిగిన వారికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆరోగ్య సంక్ష‌ర‌ణ‌, విద్యా రంగానికి కొంత మేలు చేకూరుతుంద‌ని అన్నారు. స‌న్ మైక్రోసిస్ట‌మ్స్ ను స్థాపించ‌డం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచంలో అమెరికాకు ఎందుకంత క్రేజ్ ఉంద‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు వినోద్ ఖోస్లా. మ‌నం కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని అనుకోవ‌డానికి వీలు లేదు. కానీ వెన‌క్కి త‌గ్గ‌డం అంటూ జ‌ర‌గ‌ద‌న్నారు.
The post జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్షఅమరావతిలో పవిత్ర హారతిపై ఈవో సమీక్ష

తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతి కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం టీటీడీ పరిపాలనా భవనంలోని

సంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనాసంజూ శాంస‌న్ కెరీర్ ఇక ముగిసిన‌ట్టేనా

హైద‌రాబాద్ : కేర‌ళ క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంసన్ కు అస‌లు ఏమైంద‌ని ఆవేద‌న చెందుతున్నారు ల‌క్ష‌లాది త‌న అభిమానులు. ఇండియ‌న్ క్రికెట్ లో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌డు. ఒ వైపు అభిషేక్ శ‌ర్మ‌,

వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్వ్య‌వ‌సాయ రంగంలో ఏఐ అమ‌లు భేష్

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మ‌న్ బిల్ గేట్స్ సోమ‌వారం ఏపీ రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రుల‌తో సంభాషించారు.