hyderabadupdates.com Gallery పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు

పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు

పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు post thumbnail image

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలించ‌డం చేత కావ‌డం లేద‌న్నారు. ఐఎస్ఐ, ఐపీఎస్ లను పూటపూటకు మార్చడం వలన పాలన కుంటు పడుతుందన్నారు. ఒక్క సంవత్సరంలో 5 సార్లు బదిలీలు చేశారని ఇదేం పాల‌న అంటూ ఎద్దేవా చేశారు. యావరేజ్ గా చూస్తే 6 నుండి 8 నెలలకు ఒక్క హెచ్ఓడి మారాడ‌న్నారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగం చూస్తే 5 అధికారులు మారడం విచిత్రం అన్నారు హ‌రీశ్ రావు. అందుకే విద్యుత్ శాఖ ఆగమాగం అవుతుందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అధికారుల‌ను స్థిరంగా ఉండ‌నీయ‌కుండా ప‌దే ప‌దే బదిలీ చేయ‌డం వ‌ల్ల విద్యుత్ శాఖ అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఆ శాఖను అర్ధం చేసుకునే లోపే బదిలీ అవుతున్నారని పేర్కొన్నారు హ‌రీశ్ రావు. సింగరేణి సంస్థలో కూడా 4 మారారని గుర్తు చేశారు. ఇక కీల‌క‌మైన హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ లో కూడా ఇదే ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. ఐ అండ్ పీఆర్ లో కూడా 4 అధికారులు మారారని, అందుకే ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల‌కు ఆక్రిడిషన్ కార్డులు కూడా రావడం లేదన్నారు. విద్యాశాఖ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ముగ్గురు అధికారుల బదిలీలు అయ్యాయ‌ని తెలిపారు. ఆరోగ్య శ్రీలో 8 అధికారులు బదిలీలు అయ్యారని, పేదలకు ఏం వైద్యం అందిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇక రంగారెడ్డి జిల్లా విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు క‌లెక్ట‌ర్లు మారార‌ని తెలిపారు.
The post పాల‌నా ప‌రంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ : హ‌రీశ్ రావు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలిహిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలి

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముస్లింల‌ను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాట‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాల‌ని పిలుపునిచ్చారు. రోజు రోజుకు భార‌త

జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా మన

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డిందినా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి టెండ‌ర్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న వ‌ల్ల‌నే నైనీ