hyderabadupdates.com Gallery అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్ post thumbnail image

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను త‌న సార‌థ్యంలో రెండుసార్లు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని, త‌మ కుర్రాళ్లు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక మ్యాచ్ లో కీల‌క భూమిక పోషించార‌ని అన్నాడు. కానీ ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సి వ‌స్తే ఇద్ద‌రు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించార‌ని చెప్పాడు గెలుపొందిన అనంత‌రం సూర్య కుమార్ యాద‌వ్. ఒక‌రు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ కాగా మ‌రొక‌రు ముంబైకి చెందిన స్పీడ్ స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అన్నాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో అడ్డుగోడ‌లా నిల‌బ‌డి సెమీ ఫైన‌ల్ కు తీసుకు వ‌చ్చాడంటూ శాంస‌న్ గురించి తెలిపాడు. అంతే కాదు సెమీ ఫైనలలో సైతం స‌త్తా చాటాడ‌ని, ఇక ఫైన‌ల్ లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడ‌ని కితాబు ఇచ్చాడు.
ఇది చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని అన్నాడు సూర్య భాయ్ . కోచ్ , మేనేజ్మెంట్, బీసీసీఐ పెద్ద‌లు, తోటి ఆట‌గాళ్లు, అభిమానులు, ఆ దేవుడి ఆశీస్సులు అన్నీ త‌మ‌కు ఉన్నాయ‌ని చెప్పాడు. జీవితంలో మ‌రిచి పోలేని క్ష‌ణం ఇది అని పేర్కొన్నాడు. ఇలాంటి క్ష‌ణాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని, ఒక‌నాడు ఇదే వేదిక మీద తాము ఓడి పోయామ‌ని, కానీ ఇప్పుడు ఇదే స్థానంలో త‌ల ఎత్తుకుని క‌ప్ ను అందుకున్నామ‌ని, ఇక సెంటిమెంట్ల‌కు తావు లేద‌ని తాము నిరూపించామ‌ని అన్నాడు సూర్య కుమార్ యాద‌వ్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచ కప్ తర్వాత ఆ సమయంలో బీసీసీఐ కార్య‌ద‌ర్శితో పాటు రోహిత్ శ‌ర్మ నాకు స‌హ‌కారం అందించార‌ని తెలిపాడు. గ‌త రెండు ఏళ్లుగా మేం ఇదే ఫార్మాట్ లో ఆడుతున్నాం. ఎన్నో అనుభ‌వాలు ఉన్నాయ‌ని చెప్పాడు.
The post అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

BPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదనBPCL: కుమార్తె చావులో అధికారుల కాసుల వేటపై మాజీ సీఎఫ్‌ఓ ఆవేదన

BPCL : లంచాలు ఇచ్చి తాను ఎంతగానో విసిగిపోయానని… కుమార్తె మరణించిన బాధలో ఉన్నా ఎవరూ కనికరం చూపలేదని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింట్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ (BPCL)లో సీఎఫ్‌ఓ

టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌టీటీడీ ఈవోగా శ్రీ‌కాకుళం బిడ్డ ముద్దాడ ర‌విచంద్ర‌

తిరుమ‌ల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను

ఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కంఏఐలో అమెరికా, భార‌త భాగ‌స్వామ్యం కీల‌కం

న్యూఢిల్లీ : ఏఐ ప్రయోజ‌నాల‌ను అంద‌రికీ అందుబాటులో ఉంచ‌డంలో యుఎస్, భార‌త భాగ‌స్వామ్యం కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్‌గా పని చేయడం పట్ల గూగుల్