hyderabadupdates.com Gallery టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం post thumbnail image

అహ్మ‌దాబాద్ : త‌న శిక్ష‌ణ‌లో రాటు దేలిన భార‌త జ‌ట్టు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ క‌ప్ ను ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు అంకితం ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. కోట్లాది మందిని విస్తు పోయేలా చేశాడు . తన అత్యల్ప దశలో తన పక్కన నిలిచిన వ్యక్తిని పేర్కొన్నాడు. ఈ గెలుపును గంభీర్ రాహుల్ ద్ర‌విడ్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ల‌కు అంకితం ఇస్తున్న‌ట్లు తెలిపాడు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు గాను బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇండియా క‌ప్ విన్ అయ్యాక గంభీర్ మీడియాతో మాట్లాడాడు.
2026 సంవత్సరం గౌతమ్ గంభీర్ కు ఒక రకమైన గుర్తింపుగా నిలిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లలో ఓడిపోయిన తర్వాత, ప్రపంచ ఛాంపియన్ ఆటగాడు తీవ్ర విమర్శలకు గురయ్యాడు. కానీ అనూహ్యంగా త‌న వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ పోయాడు. త‌ను ఎంచుకున్న ఆటగాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఆపై వారిలో విశ్వాసం నింపాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. తన అర్ధంలేని శైలికి కట్టుబడి, డ్రెస్సింగ్ రూమ్‌లోని వ్యక్తులకు మాత్రమే తాను జవాబుదారీ అని గంభీర్ ప్రకటించాడు. ఇదిలా ఉండ‌గా టీం ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు మూడు టి20 ప్ర‌పంచ క‌ప్ ల‌ను గెలుచుకుంది. 2007లో , 2004లో , 2026లో స‌త్తా చాటింది.
The post టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా ప్ర‌భ‌ల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వ‌హిస్తామ‌ని, ఈ మేర‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపార‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది.

KTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదుKTR: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు

KTR : కాంగ్రెస్‌ పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సోమవారం బీఆర్కే భవన్‌ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్ (KTR).