hyderabadupdates.com Gallery భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం

భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం

భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం post thumbnail image

హైద‌రాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల‌ 19వ తేదీ నుంచి రెండు భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్‌లో తొలి ప్రదర్శనలుగా రెండు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలను ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అల్లు సినిమాస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. ఇందులో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా నిలుస్తోంది. ఆసియాలో అతిపెద్దదిగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా దీనికి గుర్తింపు ఉంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దారు. స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, ప్రతి దిశ నుంచి వచ్చే అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.
ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్‌ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు, జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్‌లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. ప్రొజెక్షన్ సిస్టమ్స్, సౌండ్ సెటప్, ఇతర సౌకర్యాలను పరిశీలించి, పబ్లిక్ ఓపెనింగ్‌కు అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది.
The post భారీ నిర్మాణం ‘అల్లు సినిమాస్’ సంచ‌ల‌నం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Telangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతTelangana Government: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Telangana Government : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గ

‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్‘పొండ‌ట్టి’ లేక పోతే నేను లేను : సంజు శాంస‌న్

ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ పై అజేయ‌మైన శ‌త‌కంతో విరుచుక‌ప‌డ్డాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడి. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాంరాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

హైద‌రాబాద్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా.