hyderabadupdates.com Gallery పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్

పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్

పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్ post thumbnail image

ముంబై : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు మ‌రో ఓట‌మి ద‌క్కింది. ఐపీఎల్ 2026లో భాగంగా స్వంత గ‌డ్డ‌పై జ‌రిగిన కీల‌క పోరులో పేల‌వ‌మైన ఆట‌తీరుతో చేతులెత్తేసింది. ఇక టోర్నీలో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ఆజ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. మ‌రో వైపు డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌న జోరు కొన‌సాగిస్తోంది.
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పంజాబ్ బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు ముంబై బ్యాట‌ర్లు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ముంబై ఇండియ‌న్స్ ను ఏకంగా 7 వికెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది. యంగ్ క్రికెట‌ర్ ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ 39 బంతులు ఎదుర్కొన్నాడు. 80 ర‌న్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. త‌న‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ సూప‌ర్ షో చేశాడు. త‌ను కేవ‌లం 35 బాల్స్ ఆడి 66 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. ముంబై ఇండియ‌న్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అయితే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు చెందిన క్వింట‌న్ డికాక్ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. త‌ను 60 బంతుల్లో సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. 112 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి. త‌ను సెంచ‌రీ బాద‌డంతో ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 195 ర‌న్స్ చేసింది. ఇక డికాక్ తో పాటు న‌మ‌న్ ధీర్ రెచ్చి పోయాడు. 31 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి.
The post పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

డీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లైడీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లై

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తమిళనాడు ప్రజల సంక్షేమాన్ని తన విధానంగా స్వీకరించిన

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో

Rajasthan: రాజస్థాన్‌ లో మరో బస్సు ప్రమాదం ! 18 మంది దుర్మరణం !Rajasthan: రాజస్థాన్‌ లో మరో బస్సు ప్రమాదం ! 18 మంది దుర్మరణం !

Rajasthan : రాజస్థాన్‌లో ఏసీ బస్సు దగ్ధమైన సంఘటన మరవక ముందే ఆదివారం మరో బస్సు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉన్న ట్రయిలర్‌ను బస్సు ఢీకొనడంతో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజధాని జైపూర్‌కు (Jaipur)