hyderabadupdates.com movies ఇంకో పెద్ద స్టేట్మెంట్.. తుస్సుమంది

ఇంకో పెద్ద స్టేట్మెంట్.. తుస్సుమంది

తమ సినిమాల గురించి పాజిటివ్‌గా మాట్లాడ్డం వరకు ఓకే. కొంచెం ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ అత్యుత్సాహంతో భారీ స్టేట్మెంట్లు ఇస్తేనే చాలా కష్టమవుతుంది. రిలీజ్‌కు ముందు అలాంటి స్టేట్మెంట్లు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేయొచ్చు. ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించవచ్చు. కానీ ఏదైనా తేడా కొడితే.. డ్యామేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ కామెంట్లు ట్రోల్ మెటీరియల్‌గా మారతాయి. సినిమాకు చేటు చేస్తాయి. 

ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనకు తలనొప్పిగా మారేలా ఉంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ కాకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఐతే రాజేంద్ర ప్రసాద్ పాజిటివ్ కోణంలో ‘షాక్’ అవుతారు అంటే.. ఆడియన్స్ ఇంకో రకంగా షాకయ్యారు. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా తీసి మెప్పించగలమని ఎలా అనుకున్నారు అనుకుంటూ షాకవుతున్నారు. 

అసలు రాజేంద్ర ప్రసాద్ పాత్రలో ఏమంత విషయం ఉందని అంత ఎగ్జైట్ అయ్యారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సినీ జనాలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బంది పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో విశ్వక్సేన్ ‘పాగల్’ అనే సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

నేచురల్ స్టార్ నాని ‘కోర్టు’ మూవీ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని అన్నాడు. కానీ ఆ సినిమా హిట్టయి నాని మాటకు విలువ చేకూర్చింది. ఐతే కానీ ‘కోర్టు’లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి.. నానిని అనుకరిస్తూ ‘మిత్రమండలి’ సినిమా విషయంలో సేమ్ ఇలాంటి ఛాలెంజే విసిరాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే సినిమాకు హైప్ ఇవ్వడం కోసం మరీ పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం మంచిది.

Related Post

మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా