ముంబై : మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వస్తానో తెలియదని అన్నారు. తనకు రావాలంటే ఇక్కడ పాస్ పోర్టు రావాల్సి ఉంటుందన్నారు. కానీ అది దొరకడం లేదన్నారు. ముంబై హైకోర్టుకు హాజరు కావాల్సి ఉండగా తన తరపు న్యాయవాది ఈ విషయాన్ని పై విధంగా తెలిపారు. రద్దు చేయబడిన తర్వాత తన వద్ద యాక్టివ్ పాస్పోర్ట్ లేదని, అందువల్ల, భారతదేశానికి తిరిగి వచ్చే తేదీని తాను ఇవ్వలేనని మాల్యా అన్నారు. బహుళ మోసం, మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటూ పరారీలో ఉన్నారు వ్యాపారవేత్త. తాను యుకె నుండి రావాలంటే పాస్ పోర్టు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఇక్కడ చట్ట బద్దంంగా తనపై నిషేధం ఉందన్నారు. దీని వల్ల తాను రాలేక పోతున్నట్లు తెలిపారు విజయ్ మాల్యా.
తన న్యాయవాది అమిత్ దేశాయ్ ద్వారా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం కలకలం రేపింది. తన వద్ద యాక్టివ్ పాస్పోర్ట్ లేదన్నారు. దీని కారణంగా ఎప్పుడు వస్తాననే విషయం , తేదీ చెప్పడం సాధ్యం కాదన్నారు వ్యాపారవేత్త. ఇదిలా ఉండగా విజయ్ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చే వరకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్ను విచారించబోమని ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్బంగా భారతదేశానికి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా అని స్పష్టం చేయాలని కోర్టు మాజీ మద్యం వ్యాపారిని కోరింది.
The post ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను
Categories: