hyderabadupdates.com Gallery ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి :  సీఎం post thumbnail image

అమరావతి : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, వివిధ పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు.. రూ.18 కోట్ల వ్యయంతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను కొనుగోలు చేసిందన్నారు సీఎం.
వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం వాటి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించు కున్నందుకు అధికారులను అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని..వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాలా ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. అన్ని సవాళ్ళను అధిగమించి… కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
The post ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

ముంబై : ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయంటీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన

టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతటీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన కీల‌క పోరులో భార‌త్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. ఈ టోర్నీ లో మ‌రోసారి