hyderabadupdates.com Gallery కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ

కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ post thumbnail image

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్‌స్ట్రక్షన్స్ కొండ‌ల‌ను త‌వ్వుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తులు లేకుండా త‌వ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు. రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల సర్కార్ భూమి ధారాదత్తం చేశారంటూ మండిప‌డ్డారు. పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టవా? మంత్రులు, వారి బంధువుల భూకబ్జాలు కనిపించవా అని నిల‌దీశారు. అక్రమ మైనింగ్ నిలిపివేసి, పెనాల్టీతో రికవరీ చేయాల‌ని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీటు తరలిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనులశాఖ మంత్రి వివేక్‌ సహా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
శని, ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్ల మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్లకు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? సాధారణ ప్రజలకు ఒక న్యాయం? ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా అని నిల‌దీశారు హ‌రీశ్ రావు. రియల్‌ ఎస్టేట్‌ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని తనవారికి పప్పు బెల్లంలా కట్టబెడుతున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీయా అనే అనుమానం క‌లుగుతోంద‌న్నారు.
The post కొండ‌లు మింగుతున్న ‘పొంగులేటి’ కంపెనీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్మాట నిల‌బెట్టుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఉన్నంత వ‌ర‌కు పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా చూస్తాన‌ని అన్నారు. శ‌నివారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానంబ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. భ‌క్తుల‌తో అల‌రారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యం. ఈనెల‌లో శివ రాత్రి ప‌ర్వ‌దినం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య

జ‌గ‌న్ కు సోయి లేదు బుద్ది రాదు : ఎస్. స‌వితజ‌గ‌న్ కు సోయి లేదు బుద్ది రాదు : ఎస్. స‌విత

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : సంక్రాంతి పండుగ రోజైనా జ‌గ‌న్ రెడ్డికి బుద్ది రావాల‌ని తాను కోరుకుంటున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు