hyderabadupdates.com Gallery గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం post thumbnail image

ముంబై : స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో వ‌న్డే సీరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా 15 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. దేశీవాళి క్రికెట్ లో భాగంగా జ‌రుగుతున్న విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కొన‌సాగుతున్న మ్యాచ్ ల‌లో కేర‌ళ త‌ర‌పున ఆడుతున్న సంజూ శాంస‌న్ దుమ్ము రేపుతున్నాడు. తాజాగా సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించినా సెలెక్ట‌ర్లు ప‌ట్టించుకోక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు సంజూ శాంస‌న్ ఫ్యాన్స్. మ‌రో వైపు వికెట్ కీప‌ర్ గా వ‌న్డే ఫార్మాట్ లో ఎలాంటి ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌క పోయినా రిష‌బ్ పంత్ తో పాటు శుభ్ మ‌న్ గిల్ కు చోటు క‌ల్పించారు.
కాగా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ ప‌ట్ల కొన‌సాగుతున్న వివ‌క్ష‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు మాజీ క్రికెట‌ర్లు. మ‌రో వైపు సంజూ శాంస‌న్ తో పాటు బౌలింగ్ ప‌రంగా అద్బుతంగా బౌలింగ్ చేస్తూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో బెంబేలెత్తిస్తూ వికెట్లు తీస్తున్న ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన స్టార్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని సైతం ప‌క్క‌న పెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఎవ‌రిని ఉద్ద‌రించేందుకు వ‌న్డే జ‌ట్టును ఎంపిక చేశారంటూ మండిప‌డుతున్నారు. క‌నీసం భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో నైనా సంజూ శాంస‌న్ ను ఆడిస్తారో లేదోన‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు.
The post గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /

YS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిలYS Sharmila: దొంగ ఓట్ల లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి – వైఎస్ షర్మిల

  బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్