hyderabadupdates.com Gallery తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం

తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం

తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం post thumbnail image

తిరుమ‌ల‌: తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు టీటీడీ సీవీ ఎస్‌ఓ మురళీకృష్ణ ఆదేశాల మేర‌కు పోలీసులు తిరుమ‌ల‌లో నాఖా బందీ చేప‌ట్టారు. గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వ‌హించారు.58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ చేశారు. 6 షాపులకు నోటీసులు ఇచ్చారు. న‌లుగురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు .2 వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులపై హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ వజ్రపహార్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు. భక్తుల భద్రతకు భంగం కలిగించే విధంగా నిషేధిత వస్తువులు వినియోగించరాదని స్ప‌ష్టం చేశారు. గంజాయి, మద్యం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను తీసుకు రావడం, వినియోగించడం చేయరాదని అన్నారు. షాపులలో పనిచేసే సిబ్బందికి కఠినంగా సూచనలు చేశారు.
పోలీస్ సహా పలు విభాగాల 58 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి షాపులను తనిఖీ చేశారు. లైసెన్సులు, సిబ్బంది వివరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు లేని 6 షాపులకు నోటీసులు జారీ చేయగా, సరైన గుర్తింపు లేని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిషేధిత వస్తువుల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, షాపులు నిబంధనల ప్రకారం నడపాలని, అపరిచితులకు ఇవ్వకూడదని సూచించారు. అత్యవసర నంబర్లు 112, 1972 పై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.
The post తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై

తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై , ఆ పార్టీ త‌ర‌పున ఎన్నికైన శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు

గ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగిగ్లోబ‌ల్ టీచ‌ర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి

దుబాయ్ : భార‌త దేశానికి చెందిన రూబుల్ నాగి సంచ‌ల‌నంగా మారారు. త‌ను దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కార్య‌క్రమంలో అత్యుత్త‌మమైన ఉపాధ్యాయురాలి పుర‌స్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారతీయ